గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన ఇల్లు, ఒకే కుటుంబంలో నలుగురికి తీవ్రగాయాలు, మృతి !
చెన్నై నగరంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కూలిపోవడంతో ఒకరు మృతి చెంది ముగ్గురికి తీవ్రగాయాలైనాయి.
చెన్నై: చెన్నై నగరంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కూలిపోవడంతో ఒకరు మృతి చెంది ముగ్గురికి తీవ్రగాయాలైనాయి. చెన్నైలోని ముత్తమిజ నగరలోని కోడంగయ్యూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వెంకట ప్రకాష్ (55) అనే ఆయన భార్య గీతా (45) మరణించారు.
వెంకట ప్రకాష్, ఆయన కుమార్తె షర్మిల (25), కుమారుడు కిశోర్ (22) లకు తీవ్రగాయాలై ప్రభుత్వ కీలపాక్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని పోలీసులు చెప్పారు. వెంకట ప్రకాష్ పెరంబూరులోని ఐసీఎస్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు.
వెంకట ప్రకాష్ కుమార్తె షర్మిల ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. కిశోర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వెంకట ప్రకాష్ బార్య గృహిణి. ఆదివారం ఉదయం వెంకట ప్రకాష్ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఇల్లు కుప్పకూలింది.
విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాలైన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సోమవారం వెంకట ప్రకాష్ భార్య గీతా మరణించారని పోలీసులు తెలిపారు.