వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బద్రీనాథ్‌లో కూలిన హెలికాప్టర్: ఇంజినీర్ మృతి, క్షేమంగా పైలట్లు, ప్రయాణికులు

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌‌లో శనివారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్‌కు భక్తులను తీసుకొని వెళ్తూ కుప్పకూలిపోయింది.

|
Google Oneindia TeluguNews

బద్రీనాథ్‌: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌‌లో శనివారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్‌కు భక్తులను తీసుకొని వెళ్తూ టేకాఫ్ సమయంలో కుప్పకూలిపోయింది. ఎనిమిది మందితో వెళ్తున అగస్టా 119 హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడంతో ఒకరు మృతి చెందారు.

ఈ హెలికాప్టర్‌లో మొత్తం ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఒక ఇంజినీరు ఉన్నారు. ప్రమాదంలో ఇంజినీరు ప్రాణాలు కోల్పోగా.. పైలెట్లు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారని డీజీసీఏ అధికారులు తెలిపారు.

One killed as helicopter crashes in Badrinath

ప్రమాదాన్ని పరిశీలించేందుకు విచారణ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇంజినీరు కుటుంబానికి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సంతాపాన్ని తెలియజేశారు. హెలికాప్టర్‌ ప్రమాదం తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసిందని ఆయన పేర్కొన్నారు.

English summary
A helicopter carrying pilgrims crashed soon after take-off from the Himalayan shrine of Badrinath in Uttarakhand today, killing a crew member and injuring two pilots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X