నిరుద్యోగులు పకోడీ, సమోసా అమ్ముకోవాలా?: మోడీపై హార్థిక్ పటేల్ ఘాటు విమర్శలు
గాంధీనగర్ : ప్రధాని నరేంద్రమోడీపై పటేళ్ల ఉద్యమ సారధి హార్థిక్ పటేల్ ఘాటైన విమర్శలు చేశారు. టీలు అమ్ముకునే వ్యక్తి మాత్రమే నిరుద్యోగులకు స్నాక్స్ అమ్ముకోమని చెబుతారంటూ పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ 'ఒక వ్యక్తి పకోడాలు అమ్ముకొని సాయంత్రానికి రూ.200 పట్టుకొని ఇంటికొస్తే దాన్ని ఉపాధిగా పరిగణిస్తారా? లేదా?' అని వ్యాఖ్యానించారు.
बेरोज़गार युवा को पकौडे का ठेला लगाने का सुझाव एक चायवाला ही दे सकता है, अर्थशास्त्री एसा सुझाव नहीं देता !!!!
— Hardik Patel (@HardikPatel_) January 22, 2018
మోడీ వ్యాఖ్యలపై సోమవారం తన అధికారిక ట్విటర్ ఖాతాలో హార్థిక్ పటేల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. 'చాయ్లమ్ముకునే వ్యక్తి మాత్రమే సమోసాలు అమ్ముకొమ్మని నిరుద్యోగులకు చెప్పగలరు.. అంతేగానీ, ఆ వ్యక్తి ఆర్థిక వేత్త అయి ఉంటే మాత్రం ఇలాంటి మాటలు ఎన్నటికీ చెప్పరు..' అని ఆ ట్వీట్లో హార్థిక్ పేర్కొన్నారు.