చస్తానని తెల్సు, బతికితే అద్భుతం: మెమెన్ భావోద్వేగం
నాగపూర్: బుధవారం క్షమాభిక్ష పిటిషన్ పైన విచారణ జరుగుతున్న సమయంలో రేపు ఉరి ఉంటుందా లేదా అని యాకూబ్ మెమెన్ తీవ్ర భావోద్వేగంతో ఉన్నాడని జైలు గార్డు తెలిపారు.
తన ఉరిశిక్ష రాజకీయపరమైనదని, రేపు చనిపోతానని తనకూ తెలుసునని చెప్పాడని అన్నారు. తాను బతకాలంటే ఏదైనా అద్భుతం జరగాలని చెప్పాడని మెమెన్ చెప్పాడని తెలిపారు. యాకూబ్ మెమెన్కు గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే.
పంజాబ్ ఉగ్రదాడిపై రాజ్నాథ్ సింగ్
పంజాబ్లోని గురుదాస్ పూర్ దాడి చేసిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
12 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్లో ముష్కరులను మట్టుబెట్టిన తర్వాత వారి వద్ద జీపీఎస్ పరికరాలు లభించాయని, వాటి ప్రకారం ఉగ్రవాదులు పాక్ భూభాగం నుంచి రావి నదిని దాటి వచ్చారని స్పష్టమయిందన్నారు.
దాడికి పాల్పడిన ముగ్గురు తీవర్వాదులు సైనిక దుస్తుల్లో ఉన్నారి చెప్పారు. వారి వద్ద ఏకే47లు, చైనా తయారీ గ్రెనేడ్లు ఉన్నాయని చెప్పారు. కనీసం ఒక్క ఉగ్రవాదినైనా ప్రాణాలతో పట్టుకోవాలని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయత్నించాయని చెప్పారు. కానీ వీలుకాలేదన్నారు.