వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడవిలో అలజడి ... దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్.. మావోల టార్గెట్ గా పది వ్యూహాలు

|
Google Oneindia TeluguNews

అడవిలో అలజడి కొనసాగుతోంది. ఆపరేషన్ దండకారణ్య కు రంగం సిద్ధమైంది. మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్న సమాచారంతో పెద్ద ఎత్తున మిలిటరీ దాడులు చేస్తారన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతకు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ కంచుకోట అయిన దండకారణ్యంపై కేంద్ర సాయుధ బలగాలతో దాడులకు సిద్ధం అయింది . ఐదు రాష్ట్రాల్లోకి విస్తరించి ఉన్న దండకారణ్యంలో కేంద్ర బలగాలతో పాటు, రాష్ట్ర బలగాలు మావోల ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి .

మావోల అణచివేతకు రంగంలోకి దిగిన కేంద్రం ... 5 రాష్ట్రాలు టార్గెట్

మావోల అణచివేతకు రంగంలోకి దిగిన కేంద్రం ... 5 రాష్ట్రాలు టార్గెట్


నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో పది రకాల వ్యూహాలతో కేంద్రం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలపై పట్టు సాధించడం కోసం ప్రయత్నిస్తోంది.

నవంబర్ నుండి వచ్చే సంవత్సరం జూన్ వరకు పూర్తిస్థాయిలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలో నక్సల్స్ లేకుండా చేయాలన్న ఎజెండాతో ఆపరేషన్ ప్రహార్ మొదలు పెట్టనుంది కేంద్రం. చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,ఒడిశా రాష్ట్రాలలో ఇప్పటివరకు మావోయిస్టుల ప్రభావం ఉంది. దండకారణ్యం ఈ ఇదు రాష్ట్రాలలో విస్తరించి ఉంది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల పై దృష్టి సారిస్తున్న కేంద్రం మావోయిస్టుల కంచుకోటను బద్దలు కొట్టే ప్లాన్లో ఉంది.

కొత్త రాష్ట్రాలలోకి విస్తరించే ప్లాన్ లో మావోయిస్టులు

కొత్త రాష్ట్రాలలోకి విస్తరించే ప్లాన్ లో మావోయిస్టులు


మరోవైపు మావోయిస్టులు కూడా మరో రెండు రాష్ట్రాల్లోకి తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కేంద్ర ఆపరేషన్ ప్రహార్ మొదలుపెడితే కొత్తగా ఇంకో రెండు రాష్ట్రాలకు విస్తరించేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారు. మావోయిస్టులు బెంగాల్, బీహార్ లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మావోల అణచివేతకు ఈ నెల 15వ తేదీన ఐదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో కీలకమైన వీడియో కాన్ఫరెన్స్ ను కేంద్రం నిర్వహించింది.

మావోలకు బయట సంబంధాలను కట్ చేసి దాడులకు స్కెచ్

మావోలకు బయట సంబంధాలను కట్ చేసి దాడులకు స్కెచ్

ఈ సమావేశంలో దండకారణ్యంలో ఏ విధంగా మావోయిస్టు స్థావరాలపై అటాక్ చేయాలి అన్న ప్లాన్స్ పై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

మావోయిస్టులకు బయట గ్రామాలలో ఉండి సహకరిస్తున్న సానుభూతిపరులను టార్గెట్ చేయడంతో పాటుగా, మావోయిస్టు స్థావరాలకు వారికి కావలసిన నిత్యావసరాలు అందకుండా చేయడం, ఏకకాలంలో మావోయిస్టుల ఏరివేతతో పాటు, మావోయిస్టు సానుభూతిపరుల భావజాల ప్రచారాన్ని ఎదుర్కోవడం చేయనున్నారు .

Recommended Video

Encounter : Ten Maoists And A Constable Lost Life
 వీరప్పన్ ను మట్టుబెట్టిన అధికారి చేతికి బాధ్యతలు .. ఏం జరుగుతుందో ?

వీరప్పన్ ను మట్టుబెట్టిన అధికారి చేతికి బాధ్యతలు .. ఏం జరుగుతుందో ?

ఈ ఆపరేషన్ బాధ్యతను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను మట్టుబెట్టిన తమిళనాడు పోలీస్ అధికారి విజయ్ కుమార్ కు అప్పగించినట్లుగా తెలుస్తుంది. మావోయిస్టులు, కేంద్ర రాష్ట్ర బలగాలకు జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో మావోయిస్టులు ఉనికి కోల్పోతారా ? పోలీసులు పట్టు సాధిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా దండకారణ్యంలో మొదలైన తాజా అలజడితో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొంది.

English summary
The turmoil in the forest continues. The central and state governments have stepped in under the guise of Operation Prahar to uproot the Maoists with reports that the Maoists are planning to military attacks. The central government is preparing for attacks by the Central Armed Forces on Dandakaranya, the stronghold of the Maoist party. In addition to the central forces in the dandakaranya which extends into five states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X