వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మీరు చేసింది ధర్మ యుద్ధమా?: పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు స్టాలిన్ సూటి ప్రశ్న
సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై డీఎంకే నేత స్టాలిన్ మండిపడ్డారు. ఇన్నాళ్లు ధర్మ యుద్ధం చేస్తున్నామని వారు చెప్పుకున్నారని, పదవులు దక్కడంతో ఇప్పుడిక ధర్మ యుద్ధం ముగిసిందన్నారు.
చెన్నై: తమిళనాడు సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై డీఎంకే నేత స్టాలిన్ మండిపడ్డారు.
అన్నాడీఎంకే నేతలు ధర్మ యుద్ధం చేస్తున్నామని ఇన్నాళ్లు చెప్పుకున్నారని, అయితే పదవుల కోసం ఈ రోజు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గీయులు కలిశారని విమర్శించారు.
పదవుల కోసం పాకులాడడమే ధర్మ యుద్ధమా? అని ప్రశ్నించారు. పదవులు దక్కడంతో ఇక ధర్మయుద్ధం ముగిసిందా? అని ఎద్దేవా చేశారు.
ఆ ఇరువర్గాల కలయిక ఓ నాటకమని, పళనిస్వామి, పన్నీర్ సెల్వం మహానటులని స్టాలిన్ వ్యాఖ్యానించారు. పదవులు పొందడం కోసం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
Comments
English summary
Returning from his week-long overseas tour on Sunday morning, Stalin, reacting to media query on Prime Minister Narendra Modi calling the shots in the AIADMK, appreciated media’s acknowledgement of his statement and said, “Story, screenplay, dialogue and direction are done in New Delhi. OPS and EPS are performing their roles well according to the take.”
Story first published: Tuesday, August 22, 2017, 1:32 [IST]