చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎట్టకేలకు విలీనం: పన్నీరు డిమాండ్లకు పళని ఓకే, శశికళకు షాక్

ఎట్టకేలకు అన్నాడీఎంకేలోని పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాలు ఒక్కటయ్యాయి. విలీనంపై మాజీ సీఎం పన్నీరుసెల్వం సోమవారం ప్రకటన చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఎట్టకేలకు అన్నాడీఎంకేలోని పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాలు ఒక్కటయ్యాయి. విలీనంపై మాజీ సీఎం పన్నీరుసెల్వం సోమవారం ప్రకటన చేశారు.

అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో పన్నీరు, పళని వర్గాలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా పన్నీరు విలీన ప్రకటన చేశారు. పన్నీరు డిమాండ్లకు పళనిస్వామి ఒకే చెప్పారు. శశికళను పార్టీ నుంచి బహిష్కరించేందుకు అంగీకరించారు. అలాగే, పన్నీరు వర్గం నేతలకు ఆర్థిక, గృహ, హోంశాఖలు ఇవ్వనున్నారు.

OPS, Palaniswami camps unite; CM says united despite differences

ఈ సందర్భంగా పన్నీరు సెల్వం మాట్లాడారు. అమ్మ ఆశయాలకు అనుగుణంగా తాము ముందుకు సాగుతామని చెప్పారు. తమను ఎవరూ వేరు చేయలేరని చెప్పారు. అమ్మ ఆత్మ, కార్యకర్తల కోరికతో విలీనం జరిగిందని చెప్పారు.

కాగా, విలీనం నేపథ్యంలో పన్నీరు సెల్వంకు ఉప ముఖ్యమంత్రి పదవి, పార్టీ చీఫ్ బాధ్యతలు అప్పగించనున్నారు. పన్నీరు సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

English summary
The two rival factions of AIADMK led by Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami and O Panneerselvam have announced their merger on Monday in their party head-quarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X