టెక్నాలజీలో భారతీయుల ముద్ర: నిన్న సత్య నాదెళ్ల... నేడు థామస్ కురియన్
బెంగుళూరు: ప్రపంచ టెక్నాలజీ భారతీయులు శాసిస్తున్నారనడంలో ఎలాంటి సందేహాం లేదు. గత ఏడాది మైక్రోసాప్ట్ సీఈఓగా తెలుగు తేజం సత్య నాదెళ్ల పదవీ బాధ్యతలు చేపట్టగా, తాజాగా మరో టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ ప్రెసిడెంట్గా ప్రవాస భారతీయుడు థామస్ కురియన్ ఎంపికయ్యారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
బెంగుళూరుకి చెందిన థామస్ కురియన్ను సంస్ధ సాప్ట్వేర్ డెవలప్మెంట్ విభాగానికి ప్రెసిడెంట్గా నియమిస్తున్నట్లు ఒరాకిల్ ఛైర్మన్ లారీ ఎల్లిసన్ ప్రకటించారు. బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ స్కూల్లో థామస్ కురియన్ పాఠశాల విద్యను అభ్యసించారు.
ఆ తర్వాత ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్ వర్సిటీలో ఎంబీఏలో పట్టా పొందారు. 1996లో ఒరాకిల్లో వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ డెవలప్మెంట్) గా విధుల్లో చేరిన థామస్, ఒరాకిల్ సంస్ధ పలు విజయాలు సాధించడంలో తన వంతు సహకారం అందించారు.