ఫోన్ రిపేర్కు ఇస్తే...ఫోటోలతో బ్లాక్మెయిల్...!
స్మార్ట్ ఫోన్లు రిపేరుకు వస్తే సాధారణంగా సర్వీస్ సెంటర్ లేదా సంబంధిత రిపేరు సెంటర్కు వెళ్లి ఇవ్వడం మాములే, అయితే ఆ ఫోన్లో వ్యక్తి సమాచారంతో పాటు ఇతర ఏ సమాచారం ఉన్నా దానికి జోలికి వెళ్లకుండా వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.. రిపేరర్లు చేసి ఇస్తారు..కాని ఢిల్లీలో మాత్రం ఓ రిపేరరు ఇందుకు విరుద్దంగా వ్యవహరించాడు. స్మార్ట్ ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి అనంతరం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు..
స్మార్ట్ ఫోన్లు రిపేరుకు వస్తే సాధారణంగా సర్వీస్ సెంటర్ లేదా సంబంధిత రిపేరు సెంటర్కు వెళ్లి ఇవ్వడం మాములే, అయితే ఆ ఫోన్లో వ్యక్తి సమాచారంతో పాటు ఇతర ఏ సమాచారం ఉన్నా దానికి జోలికి వెళ్లకుండా వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.. రిపేరర్లు చేసి ఇస్తారు..కాని ఢిల్లీలో మాత్రం ఓ రిపేరరు ఇందుకు విరుద్దంగా వ్యవహరించాడు. స్మార్ట్ ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి అనంతరం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు..
ఢిల్లోలోని శ్వేతా దీక్షీత్ అనే యువతి తన స్మార్ట్ ఫోన్ రిపేరు రావడంతో కరోల్బాగ్లోని గఫార్ మార్కెట్కు వెళ్లింది. అయితే రిపేరు కోసం స్మార్ట్ ఫోన్ పాస్వర్డ్ కావాలంటు సదరు రిపేరరు అడగడంతో పాస్వర్డ్ను ఇచ్చింది. దీంతో ఫోన్ డిస్ప్లే పోవడంతో పాటు ఇతర రిపేరును చేసిన సదరు రిపేరరు మూడు గంటల అనంతరం తిరిగి ఫోన్ ఇచ్చివేశాడు..అయితే అంతకు ముందు రిపేరు చేస్తున్నసమయంలోనే ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారంతోపాటు అందులో ఉన్న కోన్ని ఫోటోలను తీసుకున్నాడు.
ఇక రెండు మూడు రోజుల తర్వాత శ్వేతకు బ్లాంక్ నంబర్ల నుండి ఫోన్లు చేస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు..తన వద్ద మీ ఫోటోలు ఉన్నాయని బెదిరస్తూ లక్ష రుపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు..లేదంటే వాటిని యూ ట్యూబ్తోపాటు,పోర్న్ సైట్స్ల్, ఇతర సోషల్ మీడీయాలో పోస్ట్ చేస్తానని హెచ్చరించాడు.దీంతో శ్వేత పోలీసులకు పిర్యాధు చేసింది..అయితే బ్లాక్మెయిల్కు పాల్పడిన వారు తప్పుడు అడ్రలతో ఉండడంతో వారిని ట్రేస్ చేసేందుకు కష్టమవుతుందని పోలీసులు చెబుతున్నారు..స్మార్ట్ ఫోన్లు ఇచ్చేటప్పుడు వ్యక్తిగత సమాచారం వెళ్లకుండా చూడాలని సూచించారు.