200 గబ్బిలాల మృతి, టెస్టులకు రక్త నమూనాలు, బర్డ్ ప్లూ కాదట..
కరోనా వైరస్ ఆవిర్బావంపై క్లారిటీ లేదు. దీంతో వ్యాక్సిన్ కనుగొనడం ఆలస్యమవుతోంది. అయితే అక్కడక్కడ కోళ్లు, గబ్బిలాలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బీహర్లో 200 గబ్బిలాలు చనిపోవడంతో ఏం జరిగిందనే అంశం చర్చకు దారితీసింది.
భోజ్పూర్ జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో గల ఆరా వద్ద గబ్బిలాలు చనిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు యానియల్ హస్బెండరీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. వాటి నమూనాలను సేకరించి.. పరీక్షల కోసం పాట్నాకు పంపించారు. సోమవారమే ఇక్కడ గబ్బిలాు చనిపోయాయని.. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. వెంటనే ఆరువురు వైద్యుల బృందం అక్కడికి చేరుకొని నమూనాలను సేకరించారు. వాటిని శుభ్రపరిచి పాట్నాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానియల్ హెల్త్ అండ్ ప్రొడక్షన్కు పంపించామని పేర్కొన్నారు.
Recommended Video
కరోనా వైరస్ గబ్బిలాలతో సంబంధం ఉందనే ప్రచారంతో.. వందల సంఖ్యలో అవి చనిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. గబ్బిలాల మృతికి సంబంధించి నివేదిక వచ్చాకే తెలుస్తోందని.. బర్డ్ ప్లూ వల్ల చనిపోలేదని పేర్కొన్నారు. మిగతా గబ్బిలాలను ఐదు నుంచి ఆరు అడుగుల లోతులో పాతిపెట్టారు.