పళనిసామి, పన్నీర్ కు షాక్: 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా; హ్యాడ్ ఇచ్చారా ? లేదంటే జంప్ ?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అయోమయంలో పడిపోయారు. సోమవారం చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అయోమయంలో పడిపోయారు. సోమవారం చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు.
60 మంది ఎమ్మెల్యేలు, 8 మంది మంత్రులు మాకే మద్దతు: బాంబు పేల్చిన మన్నార్ గుడి !
సోమవారం జరిగే సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ హాజరుకావాలని ఆదివారం సూచించారు. సోమవారం అన్నాడీఎంకే పార్టీ లోని కార్యాలయంలో జరిగిన సమావేశానికి మంత్రులు, ఎంపీలతో పాటు కేవలం 70 మంది ఎమ్మెల్యేలు హాజరుకావడంతో సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం షాక్ కు గురైనారు.
అత్యవసరంగా నిర్వహించిన సమావేశంలో అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం ఎప్పుడు నిర్వహించాలి ? శశికళను శాశ్వతంగా పార్టీ నుంచి ఎలా బహిష్కరించాలి ? అంటూ చర్చ జరిగింది. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
సీఎం పళనిసామి అత్యవసర సమావేశం, శశికళను శాశ్వతంగా సాగనంపాలని రహస్య చర్చ !
ఆ రోజు శశికళను పార్టీ నుంచి బహిష్కరించాలని దాదాపు నిర్ణయించారు. దినకరన్ గ్రూప్ లో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో 70 మంది ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేదు ? దినకరన్ వైపు ఆ ఎమ్మెల్యేలు అడుగులు వేస్తున్నారా ? అనే చర్చ మొదలైయ్యింది.