5 నెలల్లో 50 లక్షల మందికి వ్యాక్సినేషన్.. 45 ఏళ్ల వారే ఎక్కువ.. ఎక్కడంటే..
దేశంలో కరోనా కేసులు మహారాష్ట్రలోనే ఎక్కువ వచ్చాయి. ముంబైలో కేసులు ఎక్కువగా వెలుగుచూశాయి. కరోనాకు విరుగుడు వ్యాక్సినే.. టీకా వేసుకొని ఉండటమే ఉత్తమం. అయితే మహారాష్ట్రలో టీకా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఎలా అంటే గత 5 నెలల్లో వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరం కొనసాగింది.
ఈ సమయంలో అరకోటి.. అక్షరాల 50 లక్షల మందికి టీకా ఇచ్చారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ వివరాలను వెల్లడించింది. మహారాష్ట్రలో 53 లక్షల 72 వేల 219 మంది.. కోవాక్సిన్, కోవిషిల్డ్ టీకాలను తీసుకున్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి 9 కోట్ల మంది 18 ఏళ్లు నిండినవారు ఉన్నారు. గత 5 నెలల్లో5 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16వ తేదీన ప్రారంభం అయ్యింది. రోజు 8 లక్షల మందికి చొప్పున వ్యాక్సిన్ వేసే సామర్థ్యం తమకు ఉందని హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే తెలిపారు. కానీ రోజుకు 2 లక్షల మంది వరకు వచ్చారని చెప్పారు.
Recommended Video
వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 34 లక్షల మంది 45 ఏళ్ల క్యాటగిరీలోకి వస్తారు. 8.47 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్, 8 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్స్, 2.19 లక్షల మంది 45 ఏళ్లలోపు వారు ఉన్నారని తెలిపారు.