రూ.60 వేల కోట్లు ప్రజలకు పంచారు...ఎన్నికల ఖర్చుపై సీఎంఎస్ నివేదిక
గతంలో ఎప్పుడు లేనట్టుగా 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు చేశారు అభ్యర్థులు . దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు పెట్టినా...అభ్యర్థుల పెట్టే ఖర్చుకు మాత్రం ఎలాంటీ అడ్డంకులు లేకుండా పోయాయి. దీంతో ఓటరన్న ప్రభావితం చేసుకునేందుకు వివిధ పార్టీ అభ్యర్థులు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంతో సగటున ప్రతి నియోజవర్గానికి 100 కోట్ల రుపాయల చోప్పున అభ్యర్థులు ఖర్చు పెట్టారని ఢిల్లిలోని సెంటర్ ఫర్ మీడీయా సర్వీసెస్ అనే సంస్థ గణాంకాలు విడుదల చేసింది.
2019 సార్వత్రిక ఎన్నికలు అంత్యంత ఖరీదైనవని, ఈసారి ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులు పెట్టిన ఖర్చు , ప్రచారం చేసిన తీరు తెన్నులు అశ్చర్చపరిచాయని ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై అంచనా వేసిన సిఎంఎస్ అనే సంస్థ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతోపాటు అభ్యర్థులు ఓటర్లపై సుమారు 60వేల కోట్ల రుపాయల వరకు ఖర్చు పెట్టారని తెలిపారు.ఈనేపథ్యంలోనే ఓక్కో నియోజకవర్గంలో అభ్యర్థుల అవరేజ్ ఖర్చు 100 కోట్ల వరకు ఉంటుందని వారు ప్రకటించారు.
అయితే ఓటర్లకు డబ్బులు పంపీణి చేసిన వ్యయం మాత్రమేనని ఇక ప్రచారం ,బెట్టింగులతో పాటు ఇతర ఖర్చులు తీసుకుంటే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ మొత్తం ఖర్చులు తీసుకుంటే అనూహ్యంగా ఎన్నికల ఖర్చు పెరుగుతుందిని తమ అధ్యయనంలోతేలినట్టు ప్రకటించారు.
కాగా ఈ సందర్భంగా సీఎంఎస్ సంస్థ చర్చాకార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్ ఖురేషీ పాల్గోన్నారు.కాగా ఇలాంటి ధన ప్రభావం వల్ల ప్రజాస్వామ్య వ్వవస్థకు చేటు చేస్తుందని దీన్ని అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిర్వాహాకులు అందోళన వ్యక్తం చేశారు.