మెరీనాబీచ్ లో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని విధ్యార్థుల ఆందోళన
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని మెరీనాబీచ్ లో వందలాది మంది విధ్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి నుండి ఈ ఆందోళన సాగుతోంది.
చెన్నై : జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని మెరీనాబీచ్ లో విధ్యార్థులు,యువకులు , ఐటి ఫ్రో ఫెషనల్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి నుండి ఈ ఆందోళన సాగుతోంది. ఈ ఆందోళనలో సుమారు మూడువేల మందికి పైగా పాల్గొన్నారు.
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ మెరీనా బీచ్ కేంద్రంగా ఈ ఆందోళన సాగుతోంది. ఈ ఆందోళనలో ప్రధానంగా విధ్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుండి మెరీనాబీచ్ కేంద్రంగా ఈ ఆందోళన సాగుతోంది.
పోలీసులు ఆందోళన కారులతో చర్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. మెరీనాబీచ్ లో ఆందోళన చేస్తున్నవారికి మద్దతుగా పలు కశాళాలల నుండి విధ్యార్థులు వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు.
విధ్యార్థులతోపాటు ఐటి ఫ్రోఫెషనల్స్ కూడ ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు కూడ ఈ ఆందోళనలో పాల్గొని మద్దతు ప్రకటించారు.జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ డిఎంకె ఇటీవలనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.