వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మ శ్రీ పురస్కారం: తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు వీరే..

|
Google Oneindia TeluguNews

పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 119 మందికి పద్మ అవార్డులతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం. విడుదల చేసింది. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులకు పద్మశ్రీలు రావడం విశేషం అని చెప్పుకోవచ్చు.

Recommended Video

#TOPNEWS : #RepublicDay2021|AP Panchayat Election Re Schedule|Padma Awards 2021 | Oneindia Telugu
 padma shri awards for telugu states persons

అన్నవరపు రామస్వామికి కళారంగంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవర ప్పాడు గ్రామం. అలాగే నిడమోలు సుమతీకి కూడా అవార్డు వచ్చింది. ఆమెకు కూడా కళారంగంలోనే అవార్డు వరించింది. సాహిత్యంలో అసవాది ప్రకాశ్‌రావుకు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఇతని స్వగ్రామం అనంతపురం జిల్లా, సింగనమల మండలం కొరివిపల్లి గ్రామం.

ఇక తెలంగాణ విషయానికి వస్తే కళారంగంలో శ్రీ కనకరాజుకు అవార్డు దక్కింది. కొమురంభీం జిల్లా జైనూరు మండలం మార్లవాయికి చెందిన ఆయన.. ఆదివాసీ సాంస్కృతిక వైభవం గుస్సాడీకి గుర్తింపు తెచ్చారు. ఇదీ ఆదివాసీ సమాజానికి దక్కిన గౌరవమని ఆదివాసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో పాటు.. దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్‌.. గాయని చిత్రకు పద్మభూషణ్‌ అవార్డులు వరించాయి. వీరిద్దరూ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులే.

English summary
padma shri awards for telugu states persons list here. ap, telangana famous persons are there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X