'పద్మావతి' వివాదం: మృతుడి మొబైల్తో మిస్టరీ వీడేనా....
జైపూర్: నహరగఢ్ వద్ద ఉరేసుకున్న 40 ఏళ్ల వ్యక్తి మిస్టరీని ఛేదించడానికి అతని మొబైల్ ఫోన్ కీలకమైన ఆధారం అవుతుందని అంటున్నారు. అతని మృతికి సంబంధించిన మిస్టరీ దానివల్ల వీడే అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
మరణానికి ముందు చేతన్ సైనీ సెల్పీలు తీసుకున్నాడు. అవి ఏ మాత్రం చెక్కు చెదరలేదని అంటున్నారు. ఆ ఫోన్ను పోలీసులు పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించారు. ఆన్లైన్లో వీడియోలను ఏమైనా అప్లోడ్ చేశాడా అనే విషయాన్ని పరిశీలించాలని కూడా పోలీసులు ఎఫ్ఎస్ఎల్ అధికారులను కోరారు.
సైనీ గురువారంర సాయంత్రం మూడున్నర గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. మర్నాడు స్థానికులు నహర్గఢ్ కోట గోడలకు వేలాడుతున్న శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అతని చొక్కా జేబులో కొన్ని వస్తువులతో పాటు మొబైల్ ఫోన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.
కోట గోడ బ్యాక్గ్రౌండ్గా సైనీ తన మొబైల్ ఫోన్తో కొన్ని సెల్పీలు తీసుకున్నాడు. దాన్ని విశ్లేషణ కోసం వెంటనే ఎఫ్ఎస్ఎల్కు పంపించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. అతను మద్యం సేవించి ఉన్నాడా, లేదా అనే విషయం కూడా ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలుతుందని చెప్పారు.