'మోడీకి నితీష్ థ్యాంక్స్ చెప్పకపోవడం బాధేస్తోంది'
న్యూఢిల్లీ: విదేశాలలో నల్లధనాన్ని వెనక్కి తీసుకు వస్తామని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ గురువారం చెప్పారు. ఈ మేరకు విదేశాలతో ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పారు.
బీహార్ రాష్ట్రానికి ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధాని మోడీకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ధన్యవాదాలు చెప్పవలసింది పోయి విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. నితీష్ కుమార్ తీరుతో తాను తీవ్రంగా బాధపడ్డానని చెప్పారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్యాకేజీ కోసం గత రెండేళ్లుగా అడుగుతున్నారని గుర్తు చేశారు. మోడీ ప్యాకేజీతో బీహారీలు అందరూ సంతోషంగా ఉన్నారని, నితీష్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారి అభిప్రాయపడ్డారు.
మోడీకి ఆ సత్తా ఉంది: సుబ్రహ్మణ్య స్వామి
భారతీయులు అక్రమంగా విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చే సత్తా ప్రధాని మోడీకి ఉందని బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి బుధవారం ధీమా వ్యక్తం చేశారు. ఆయన అమెరికాలో ప్రవాస భారతీయుల భేటీ సందర్భంగా చెప్పారు.