ఇదీ విషయం: కన్హయ్యలాల్ హత్య వెనక, దావత్ ఎ ఇస్లామీ, ఇండియాలో కూడా
మహ్మద్ ప్రవక్తపై కామెంట్లతో దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఉదయ్పూర్కు చెందిన టైలర్ కన్హయ్యను ఓ ముస్లిం దారుణంగా హతమార్చాడు. అయితే ఆ హత్యతో కరాచీ మూలాలు ఉన్న ఇస్లామిక్ సంస్థ.. దావత్ ఏ సలాంతో సంబంధాలు ఉన్నాయని రాజస్థాన్ పోలీసులు అంటున్నారు. అయితే ఈ అంశాన్ని పాకిస్థాన్ కొట్టిపారేసింది. అదేం లేదని తేల్చిచెప్పింది.
నిందితులకు పాకిస్థాన్తో సంబంధం ఉందని భారత వీడియో ప్రయత్నిస్తోందని ఆ దేశం ఆరోపిస్తోంది. వాటిని పాకిస్థాన్ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. కానీ ఇండియా టుడే ఈ అంశాన్ని పరిశీలించగా అదీ తప్పు అని తేలింది. దావత్ ఏ ఇస్లామి పరిధి కన్హయ్యలాల్ హంతకులే కాదు.. మతోన్మాదులకు విస్తరించిందని తేలింది. అంతేకాదు భారతదేశంలో గల ముస్లిం ఇళ్లలోకి కూడా తీసుకొచ్చారనే సంచలన విషయాన్ని తెలిపింది. అందుకోసం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుందని కనుగొంది.
దావత్ ఏ ఇస్లామీ సైట్లో మతపర కార్యక్రమాలు ఉంటాయి. కార్యకలాపాల జాబితాలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెనడా, హాంకాంగ్, కొరియా, లండన్, అమెరికా ఉన్నాయి. కానీ భారతదేశం పేరు మాత్రం అందులో లేదు.
జూలై 22వ తేదీన ఇండియా టుడే రిపోర్టర్ రషీద్ అహ్మద్ అనే మరో పేరుతో భారతీయుడిగా తన పేరును నమోదు చేసుకున్నారు. కోర్సు ఆప్లై చేయగా.. కొన్ని గంటల తర్వాత సంస్థ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సంభాషణ జరగడానికి ఇండియా వాట్సాప్ నంబర్ 9137589497 నంబర్ సూచించింది. అదే రోజు రాత్రి ఒకరు ఫోన్ చేశారు. దావత్ ఏ ఇస్లామీకి చెందిన హసిన్ అహ్మద్ కాల్ చేశారు. అయితే అతను మధ్యప్రదేశ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేశాడు. మీరు ఆపలై చేశారుగా అని సంభాషణ స్టార్ట్ చేశారు. ఎస్ అనడంతో వారి మధ్య చర్చ ప్రారంభమైంది.
కోర్సు వివరాలు, ఉదయం క్లాస్ స్కైప్లో ఉంటుందని తెలిపారు. ఫీజు రూ.1200 వరకు అని చెప్పాడట. ఇలా వారి మధ్య సంభాషణ జరిగాక క్లాసులు మొదలవుతాయి. అలా వారిలో క్లాసులు నేర్పి.. విద్వేషాన్ని రగులుస్తారు. జైపూర్ పోలీసుల వాదనకు, ఇండియా టుడే స్రింగ్ ఆపరేషన్ తోడై.. ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసింది.