వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ను షేక్ చేసిన మిరాజ్.. తోకముడిచిన F-16

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకార చర్య కోసం ఎదురుచూస్తున్న భారత సైన్యానికి సరైన అవకాశం దొరికింది. అదనుచూసి పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. పుల్వామా ఘటనలో 40 మందికి పైగా జవాన్లు చనిపోవడంతో సైన్యం ప్రతీకారేచ్ఛకు దిగింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో మంగళవారం తెల్లవారుజామున పాక్ ఉగ్రవాదులకు చుక్కలు చూపించింది. నియంత్రణ రేఖ దాటి టెర్రరిస్టు క్యాంపులను టార్గెట్ చేసింది. భారత వాయుసేన దాడిని ప్రతిఘటించేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది.

Recommended Video

దెబ్బకు దెబ్బ .. పాక్ పై భారత్ మెరుపు దాడి.. 300 మంది ఉగ్రవాదులు మృతి !

పాకిస్థాన్ కు చెందిన F -16 విమానాలు.. భారత వాయుసేనపై ప్రతిదాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే మిరాజ్ 2000 యుద్ధవిమానాల దాటిని అవి ఎదుర్కోలేకపోయాయని సమాచారం. మిరాజ్ యుద్ధ విమానాలు బీభత్సం సృష్టిస్తుంటే అవి తోక ముడిచినట్లు స్పష్టమవుతోంది.

PAK F- 16 flights drop down while mirage 2000 fighter jet attack

మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు పాక్ ఉగ్రశిబిరాలపై దాడులకు పాల్పడింది భారత వాయుసేన. అంబాలా ఎయిర్ బేస్ నుంచి చేపట్టిన ఈ ఆపరేషన్ లో దాదాపు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలను టెర్రరిస్టు స్థావరాలపై విసిరింది. ఈ దాడిలో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

English summary
Pakistan has been trying hard to resist the Indian Air Force attack. PAK F- 16 flights drop down while mirage 2000 fighter jet attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X