పాకిస్థాన్ తరఫున వకాల్తా పుచ్చుకున్న మహబుబా ముఫ్తి, పాక్ సైతం పండగల కోసం ఆణుబాంబులను దాచుకోలేదు
కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడి పాకిస్థాన్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు బదులుగా పాక్ బదులుగా ఆమే స్పందించారు. దీంతో ఆమే పాకిస్థాన్ కు సపోర్టు చేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడి , ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ లో పర్యటించారు. ఈనేపథ్యంలోనే పాకిస్థాన్ తరచూ అణుబాంబులు వేస్తామని బెదిరిస్తోందని , అయితే మేము కూడ చూస్తూ ఊరుకోమని, భారత్ సైతం అణ్వస్త్ర్రాలను కలిగి ఉన్న దేశమని ,వాటిని దీపావళీ కోసం దాచుకోలేదని మోదీ వ్యాఖ్యానించారు.
అయితే ప్రధాని వ్యాఖ్యలు పాకిస్థాన్ ను ఉద్దేశించి చేసిన నేపథ్యంలో పాక్ కాకుండా కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబుబా ముఫ్తి స్పందిచారు. పాకిస్థాన్ సైతం ఈద్ కోసం అణుబాంబులను దాచుకోలేదని అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా పాకిస్థాన్ నుండి ఎలాంటీ స్పందన రాకుండా పాకిస్థాన్ తరఫున ముఫ్తి వ్యాఖ్యానిండం వివాదాన్ని రేపుతోంది.