వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి సమీపంలో భారీగా పాక్ అణ్వాయుధాలు, ఏం జరుగుతోంది?

ఇండియా లక్ష్యంగా పాకిస్థాన్ అణు ఆయుధాలను సమకూర్చుకొంటున్నట్టు ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్ ప్రకటించింది. పాకిస్తాన్‌ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు ఆ వెబ్‌సైట్ ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియా లక్ష్యంగా పాకిస్థాన్ అణు ఆయుధాలను సమకూర్చుకొంటున్నట్టు ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్ ప్రకటించింది. పాకిస్తాన్‌ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు ఆ వెబ్‌సైట్ ప్రకటించింది.

దాదాపు 140 అణు ఆయుధాలను తయారు చేసిన పాకిస్తాన్‌ వాటిని దాచేందుకు రహస్య ప్రదేశంలో సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు ఆ వెబ్‌సైట్‌ పేర్కొంది.పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ పట్టణంలో ఈ సొరంగాన్ని నిర్మించబోతున్నారని తెలిపింది.

Pakistan building tunnels to store its nuclear weapons, just 750 km from Delhi

10 మీటర్ల ఎత్తు, వెడల్పు కలిగిన మూడు సొరంగాలు పాకిస్తాన్‌ నిర్మాణాల్లో ఉంటాయని ఆ వెబ్‌సైట్ ప్రకటించింది. ఈ ప్రదేశానికి లాంచర్లను తీసుకెళ్లేలా భారీ రోడ్లతో కలుపుతున్నట్లు వెల్లడించింది.

మియన్‌వాలీ పట్టణాన్ని స్థావరంగా ఎంచుకోవడం వెనుక పెద్ద ఆలోచన ఉందని పేర్కొంది. మియన్‌వాలీ నుంచి పంజాబ్‌లోని అమృతసర్‌కు దూరం కేవలం 350 కిలోమీటర్లు.

అదే న్యూఢిల్లీకైతే 750 కిలోమీటర్లు.తక్కువ దూరంలో అణు ఆయుధాలను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా శత్రువును చావుదెబ్బ కొట్టాలనే వ్యూహం పాకిస్తాన్‌ పన్నినట్లు తెలుస్తోంది.

English summary
Pakistan is reported to have built up a stock of 140 nuclear weapons and is now building underground tunnels to store them, according to a report by WION.The site is reportedly in Mianwali, which is located 350-km from Amritsar and 750-km from New Delhi, the report added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X