షాకింగ్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెబ్సైట్ హ్యాక్... పాకిస్తానీ హ్యాకర్ల పనే...
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ kishanreddy.com మంగళవారం(అగస్టు 25) హ్యాక్కి గురైంది. పాకిస్తానీ హ్యాకర్లే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్న కథనాలు వస్తున్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున హ్యాక్కి గురైన ఈ వెబ్సైట్లో కశ్మీర్ విముక్తి,పాకిస్తాన్ తదితర అంశాలతో పాటు భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హ్యాకర్లు కొన్ని సందేశాలను ఉంచారు.
వెబ్సైట్ హ్యాక్కి గురైన విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ వెబ్సైట్పై 'temporarily unavailable' అన్న సందేశం కనిపిస్తోంది. దీని వెనక అసలు కారణాలను వెతికేందుకు సాంకేతిక నిపుణలు ప్రయత్నిస్తున్నారు.
భారత్ లేదా భారత పౌరులకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందులో లేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన డేటా కూడా అందులో ఏమీ లేదన్నారు. కేవలం కేంద్రమంత్రి వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని చెప్పారు.