కశ్మీర్ ఎఫెక్ట్: గగనతల మార్గాలను మూసివేసిన పాకిస్థాన్..!
Recommended Video
భారత దేశంపై పట్టు సాధించేందు పాకిస్థాన్ తనకు ఉన్న మొత్తం అవకాశాలను పరీశీలిస్తుంది. భారత దేశానికి ఉపయోగపడే పలు అంశాల్లో నిషేధాన్ని విధిస్తోంది. ఈనేపథ్యలంలోనే కశ్మీర్ లో ఆర్టికల్స్ తోలగింపుతో తోపాటు కశ్మీర్ విభజన అంశాలపై పాకిస్థాన్ విషం మరోసారి విషం చిమ్మింది. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతో పాటు దౌత్యపరమైన చర్యలకు కూడ ఫుల్ స్టాప్ పెట్టిన పాకిస్థాన్ అనంతరం వాయు మార్గంపై కూడ దృష్టి సారించింది. పాకిస్థాన్ గుండా వెళ్లనున్న మొత్తం పన్నేండు గగనతల మార్గాల్లో మూడింటిని మూసివేసింది.
కశ్మీర్ పరిణామాల్లో భాగంగానే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటి సమాశమైంది. ఈనేపథ్యంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వ్యాపార మార్గమైన వాఘా సరిహద్దును మూసి వేయాలని కమిటి నిర్ణయించింది. మరోవైపు ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కూడ చెక్ పెట్టింది. దీంతో భారత రాయబారిని బహిష్కరించింది. భారత్లో ఉండాల్సిన పాకిస్థాన్ రాయబారిని పంపకూడదని కూడ నిర్ణయించింది. భారత హై కమీషనర్ను బహిష్కరించిన నేపథ్యలోనే రాయబారిని వెనక్కి వెళ్లాలని కోరనుంది.
ఇక ప్రస్థుతం పాకిస్థాన్ మూసివేసిన మూడు ఎయిర్ రూట్స్ను నిషేధించడం వల్ల తమకు ఎలాంటీ ఇబ్బంది లేదని భారత దేశం పేర్కోంది. నిషేధించిన ఒక మార్గం వల్ల కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే దూరం పెరుగుతుందని తెలిపారు. కాగా అంతకు ముందు భారత దేశం బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించిన తర్వాత ఆదేశ గగనతలంపై విమాన రాకపోకలను పాకిస్థాన్ కొద్ది రోజుల పాటు నిషేధించి ఇటివల నిషేధాన్ని తోలగించింది. కాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ బిష్కేక్ సమావేశాలకు వెళ్లే సమయంలో కూడ ఆదేశం గుండా వెళ్లకుండా ఇతర మార్గం ద్వార వెళ్లిన విషయం తెలిసిందే.