మోడీపై భిలావల్ ఘాటు వ్యాఖ్యలు, బుద్ది బెబుతాం: షా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ గౌరవాధ్యక్షుడు భలావల్ భుట్టో, ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలకు మరింతగా పెంచాడు. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంట భారత్ - పాకిస్తాన్ కాల్పులపై మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్లో స్పందించాడు.
భారత్ దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని తాజాగా వ్యాఖ్యానించిన బిలావల్, "గుజరాత్ బాధితుల్లాగా, తాము ప్రతీకారం తీర్చుకోలేమనుకుంటున్నారా? తప్పనిసరిగా తిప్పికొడతాం. ఈ విషయాన్ని మోడీ తెలుసుకోవాలి" అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. పాక్ పై భారత్, ఇజ్రాయెల్ తరహా వైఖరిని అవలంభిస్తోందని కూడా బిలావల్ ఆరోపించాడు.
ఈ ట్వీట్ ద్వారా ఇండియా - పాకిస్తాన్ మధ్య గొడవలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీపై బిలావల్ ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ హ్యాకర్లమంటూ రంగంలోకి దిగిన కొందరు వ్యక్తులు ట్విట్టర్ను హ్యాక్ చేశారు.
పాకిస్తాన్కు బుద్ది బెబుతాం: అమిత్ షా
అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం పదేపదే కాల్పులకు తెగబడుతున్నా భారత ప్రభుత్వం తగిన స్దాయిలో స్పందించడం లేదన్న విమర్శల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ధీటుగా స్పందించింది. గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలా కాకుండా తమ ప్రభుత్వం తగిన ప్రతీకారం తీర్చుకుంటుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు.