కవ్వింపు చర్య: గుజరాత్ సరిహద్దుల్లో పాక్ ఎయిర్ బేస్ నిర్మాణం
చాలా కాలం విరామం తర్వాత పాకిస్తాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్లోని గుజరాత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఒక ఎయిర్ బేస్ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. సౌరాష్ట్ర కచ్ ప్రాంతాల మధ్య ఈ నిర్మాణం జరిగినట్లు సమాచారం. తమ మిలటరీ ఆపరేషన్స్ కోసం అత్యాధునిక ఎయిర్ ఫీల్డ్ను హైదరాబాద్ జిల్లాలోని భోలారిలో అభివృద్ధి చేసింది. ఇక్కడ చైనాలో తయారైన జేఎఫ్ -17 యుద్ధ విమానాలను ఇక్కడ ఉంచుతుంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే భారత్కు ఉన్న యుద్ధ విమానాలను తట్టుకునేందుకు పాకిస్తాన్ చైనాకు చెందిన జేఎఫ్ -17 యుద్ధ విమానాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇది చాలదన్నట్లుగా... పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలను సైతం పాకిస్తాన్లోని హైదరాబాద్ జిల్లాలో మోహరించారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. పాకిస్తాన్ పూనుకుంటున్న ఈ పనిపై చాలా వేగవంతంగా రియాక్ట్ అయ్యింది భారత ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భద్రతపై జరిగిన కేబినెట్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్లోని దీసా సమీపంలో ఫైటర్ బేస్ స్థాపించాలని డిసైడ్ చేశారు. అయితే ఇక్కడ రన్వేను పొడిగించేందుకు కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.