భారత్కు కృతజ్ఞతలు తెలిపిన పాకిస్థాన్: ఎందుకంటే..?
ఒక చిన్నారిని అతని తల్లి వద్దకు చేర్చటంలో భారత్ చూపిన మానవతకు పాకిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది.
ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ: ఒక చిన్నారిని అతని తల్లి వద్దకు చేర్చటంలో భారత్ చూపిన మానవతకు పాకిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. ఐదేళ్ళ బాలుడు ఇఫ్తిఖార్ అహ్మద్ను పంజాబ్ ప్రావిన్స్లోని వాఘా పట్టణంలో సరిహద్దు అధికారులు శనివారం సాయంత్రం తల్లి రోహినా కియానికి అప్పగించారు. ఆమె తన బిడ్డ కోసం సుదీర్ఘకాలం న్యాయపోరాటం జరిపింది.
తండ్రి గుల్జార్ అహ్మద్ తాంత్రే వద్ద వుంటున్న తన బిడ్డను చట్టప్రకారం తనకు ఇప్పించాలని కోరుతూ ఆమె న్యాయపోరాటం చేసింది. ఈ కేసు రెండు దేశాలకు చెందిన మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాలాకాలం తరువాత తన బిడ్డ తన వద్దకు చేరడం సంతోషంగా వుందని కయాని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన భర్తను క్షమించనున్నట్లు తెలిపారు. ఆయన కూడా త్వరలోనే తమతో కలుస్తారని ఆశిస్తున్నానన్నారు. కొన్నేళ్ళ క్రితం పాకిస్థాన్కాశ్మీర్లోరి చొరబాటు జరిపిన వారిలో తాంత్రే కూడా వున్నారు. ఆ తరువాత ఆయన కియానిని వివాహం చేసుకున్నాడు. కియాని ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత తన గ్రామం రావాలని తాంత్రే కోరాడు.
కాగా, ఆమె అందుకు తిరస్కరించింది. దీంతో తాంత్రే గత ఏడాది మార్చిలో తన బిడ్డతో సహా భారత్కు పరారయ్యాడు. దీంతో కయాని భారత్లోని ఒక కోర్టులో కేసు నమోదు చేసింది. న్యూఢిల్లీలో వున్న పాక్ దౌత్యకార్యాలయం ద్వారా కియాని కేసు నమోదు చేసింది. ఈ కేసులో కోర్టు తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. ఈ క్రమంలో శనివారం ఆ బిడ్డను వాఘా సరిహద్దులో కన్నతల్లికి భారతదేశ అధికారులు అప్పగించారు. దీనిపై భారత్లో పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు.