అమర్నాథ్ యాత్రపై దాడులకు కుట్ర పన్నిన తీవ్రవాదులు... చేధించిన భారత భద్రతా దళాలు..
తీవ్రవాదులు మరో దుస్సాహాసానికి పాల్పడేందుకు కుట్ర లేపారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా కొనసాగుతున్న అమర్నాథ్పై దాడులు చేసి అంతరాయం కల్పించాలని ప్రయత్నాలు చేశారు. అయితే టెర్రరిస్టుల ప్రయత్నాలను భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. అయితే తీవ్రవాదులకు పాకిస్థన్ మిలటరీ కూడ సహకారం చేస్తుందనే ఆధరాలను భద్రతా దళాలు బయటపెట్టాయి. అమర్నాథ్ యాత్ర జరిగే ప్రాంతాల్లో పాకిస్థాన్ మిలిటరీలో తాయారు చేసిన ల్యాండ్మైన్లతో పాటు ఏన్ ఎమ్ 24 అమేరికన్ స్నిఫర్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల నుండి స్వాధినం చేసుకున్న మారణాయుధాలను పోలీసులు మీడియా ముందు ప్రదర్శించారు.
అయితే ఈనేపథ్యంలోనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దాడులకు సంబంధించి తీవ్రవాదులు గత నాలుగైదు రోజులుగా ప్రయత్నాలు చేస్తుందని లెఫ్టినెంట్ జనరల్ ఏకే దిల్లాన్ తో మీడియాతో చెప్పారు. అమర్నాథ్ యాత్రకు ఎలాంటీ ఆటంకం కల్గకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాగా తీవ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ కూడ సహకరిస్తుందని ఆయన ఈ సంధర్భంగా తెలిపారు. ఈ నేపథ్యలంలోనే పాకిస్థాన్ ముద్రతో కూడిన ల్యాండ్ మైన్లను మిడీయా ముందు ప్రదర్శించారు.
కాగా ఎలాంటీ దాడులు జరగకుండా ఆర్మీ దళాలను అమర్నాథ్ యాత్రకు తరలించినట్టు లెఫ్టినెంట్ కల్నల్ పేర్కోన్నాడు. మరోవైపు 83 శాతం స్థానిక పిల్లలే డబ్బులకు ఆశపడి పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారని అయితే 500 కోసం రాళ్లు రువ్విన పిల్లలు రేపటి తీవ్రవాదులు అయ్యెందుకు అవకాశం కూడ ఉందని కశ్మీర్ డీజీపీ దిలాబ్ సింగ్ స్థానిక తల్లిదండ్రులను కోరాడు.