గుజరాత్లో 9మందితో కూడిన పాకిస్తాన్ బోట్ను పట్టుకున్నారు
పోరుబందర్: తొమ్మిది మందితో కూడిన పాకిస్తాన్కు చెందిన ఓ పడవను భారత గస్తీ దళం ఆదివారం పట్టుకుంది. యూరి ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రయిక్.. నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బార్డర్లో చీమ చిటుక్కుమన్నా మన సైన్యం అప్రమత్తమవుతోంది.
ఇప్పటికే మన సైనికుడిని ఒకరిని పాక్ పట్టుకుంది. అతని విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. ఇదే సమయంలో పాకిస్తాన్ బోటును పట్టుకోవడం గమనార్హం. ఈ పడవలో తొమ్మిది మంది పాక్ దేశీయులు మత్స్యకారులుగా వార్తలు వస్తున్నాయి.
కాగా, వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అసలు వారు భారత దేశ పరిధిలోని సముద్రంలోకి ఎందుకు వచ్చారు అనే అంశంపై ఆరా తీస్తున్నారు. పాక్ సరిహద్దుల్లోని తీర ప్రాంతాల్లో పలు షిప్లు, ఎయిర్ క్రాఫ్టులను మోహరించారు.