వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైపై దాడి కోసం 8 ఇంజిన్లు అమ్మిన పాక్ కంపెనీ

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ముంబైలో దాడులకు సహకరించిన వారికి పాకిస్థాన్‌కు చెందిన ఓ కంపెనీ 8 యమహా ఇంజిన్లు అమ్మినట్లు తేలింది. ముంబై చేరుకునేందుకు చిన్న పడవల్లో ఉపయోగించేందుకు కసబ్ సహా ఉగ్రవాదులకు ఇంజిన్లు అందజేసినట్లు వెల్లడైంది.

సదరు కంపెనీకి చెందిన జనరల్ మేనేజర్ ఒకరు బుధవారం ఉగ్రవాద నిరోధక న్యాయస్థానానికి ఈ విషయాలను తెలియజేశారు. రావల్పిండిలోని అడియాల జైలులోని న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో దీనిపై అతడు సాక్ష్యం చెప్పారు.

Pakistani company sold 8 Yamaha engines to 26/11 Mumbai attack facilitator

పరారీలో ఉన్న నిందితుడు అజాంఖాన్‌కు ఇంజిన్లు అమ్మినట్లు తెలిపారు. జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న ఇంజిన్లకు తమ విభాగం అనుమతి పత్రం ఇచ్చినట్లు కస్టమ్స్ అధికారి ఒకరు సాక్ష్యం చెప్పారు.

ఆ ఇంజిన్ల సహాయంతో ముంబై చేరుకున్న కసబ్ సహా మిగితా ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కాగా, ఈ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మరో ఆరుగురు నిందితులు అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

English summary
A Pakistani company had sold eight Japanese Yamaha engines to one of the 2008 Mumbai 2008 terror attacks facilitators who supplied them to terrorists, including Ajmal Kasab, for reaching Mumbai in a dingy, a senior manager of the firm on Wednesday told an anti-terrorism court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X