సుష్మాజీ! సాయం చేయండి: పాక్ మహిళ, కేంద్రమంత్రి హామీ
క్యాన్సర్తో బాధపడుతున్న పాకిస్తాన్ మహిళ భారత్లో చికిత్స కోసం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు విజ్ఞప్తి చేసుకున్నారు.
న్యూఢిల్లీ: క్యాన్సర్తో బాధపడుతున్న పాకిస్తాన్ మహిళ భారత్లో చికిత్స కోసం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు విజ్ఞప్తి చేసుకున్నారు.
బాధితురాలి వినతి మేరకు మెడికల్ వీసా అందించేందుకు సుష్మా హామీ ఇచ్చారు. ఇటీవల పాకిస్థాన్కి చెందిన ఓ చిన్నారి సర్జరీకి సుష్మా మెడికల్ వీసా ఇప్పించి, సాయం చేశారు.
ఇప్పుడు మరో యువతి సాయం కోరింది. పాక్కి చెందిన ఫైజా తన్వీర్ అనే 25 ఏళ్ల యువతి కొంత కాలంగా ఓరల్ క్యాన్సర్తో బాధపడుతోంది. ఘజియాబాద్లోని ఇంద్రప్రస్థా డెంటల్ హాస్పిటల్లో ఆమెకి చికిత్స జరగాల్సి ఉంది.
ఇందుకోసం ఆమె ఆన్లైన్ ద్వారా హాస్పిటల్లో ముందుగానే రూ.5 లక్షలు కట్టింది. కానీ చికిత్స చేయించుకోవడానికి అక్కడి భారత దౌత్యాధికారులు మెడికల్ వీసాకు అనుమతించడంలేదు. దాంతో ఆమె సుష్మా సాయం కోరింది. తన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'నాకు సాయం చేయండి సుష్మాజీ. నన్ను బతికించండి ప్లీజ్' అని ట్వీట్ చేసింది. దీనిపై సుష్మా హామీ ఇచ్చారు.