చిన్నమ్మ శపథం నెగ్గింది.. పన్నీర్ నిజస్వరూపం బయటపడింది: పళనిస్వామి
అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన పళనిస్వామి విశ్వాసపరీక్ష అనంతరం మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి వద్దకు వెళ్లారు. ఆయన వెంట పార్టీ ఎమ్మెల్యేలంతా మెరీనా బీచ్ కు తరలి వెళ్లారు.
చెన్నై: అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన పళనిస్వామి విశ్వాసపరీక్ష అనంతరం మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి వద్దకు వెళ్లారు. ఆయన వెంట పార్టీ ఎమ్మెల్యేలంతా మెరీనా బీచ్ కు తరలి వెళ్లారు. సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత అమ్మ గెలిచిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మెరీనా బీచ్ లో అమ్మకు నివాళి అర్పించిన తర్వాత సీఎం పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. చిన్నమ్మ శపథం నెగ్గిందని ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. అదే సమయంలో పన్నీర్ సెల్వంపై విమర్శలు గుప్పించారు. అమ్మకు, పార్టీకి పన్నీర్ సెల్వం తీరని ద్రోహం చేశారని అన్నారు.
అసెంబ్లీలో
పన్నీర్
సెల్వం
నిజరూపం
బయటపడిందని,
డీఎంకెతో
చేతులు
కలిపి
ఆయన
తప్పు
చేశారని
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
అసెంబ్లీలో
విపక్షాల
తీరు
తనను
బాధించిందని
అభిప్రాయపడ్డారు.
ఇకనుంచి
పార్టీ
నేతలందరం
ఐక్యంగా
ఉండి
అమ్మ
ఆశయాలను
ప్రజల్లోకి
తీసుకెళ్లడంతో
పాటు,
అమ్మ
ఆశయ
సాధనకు
కృషి
చేస్తామన్నారు.
తొలి
నుంచి
చెబుతున్నట్లు
పార్టీ
ఎమ్మెల్యేలంతా
తన
వెంటే
ఉన్నారని
మరోసారి
ఆయన
స్పష్టం
చేశారు.