బాకీ కింద భార్యను రేప్ చేస్తామన్నారు
నాసిక్: ఓ వ్యక్తి బాకీ చెల్లించలేని స్థితిలో మహారాష్ట్రలోని ఆ గ్రామానికి చెందిన పంచాయతీ సభ్యులు అత్యంత నీచమైన నిర్ణయం చేశారు. బాకీ కింద భార్యపై అత్యాచారం చేయడానికి అనుమతించాలని అడిగారు. దంపతుల ఫిర్యాదుతో అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి వారికి మద్దతుగా నిలిచింది.
అయితే ఈ సంఘటనపై ఇప్పటి వరకు ఏ విధమైన ఫిర్యాదు కూడా చేయలేదు. ఆ తర్వాత బుధవాం సాయంత్రం గోంధాలి జాట్ పంచాయతీ కుటుంబానికి క్షమాపణ చెప్పింది. ఊరికి తిరిగిరావాల్సిందిగా చెప్పారు. తమ మధ్య సమాచార వినిమయంలో లోపం వల్ల, సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, తామంతా ఐక్యంగా ఉన్నామని, ప్రశాంతంగా జీవిస్తామని ఐదుగురు సభ్యుల శామ్ ఉగాలే ఆసియన్ ఏజ్తో చెప్పింది.
వారిని వేధించబోమని, సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పింది. తమ స్వగ్రామం పర్భానిని నుంచి దంపతులు దీపక్, సోని భోరే నాసిక్కు రావడంతో విషయం వెలుగు చూసింది. పర్భానీలో వారికి గోంధాలీ వర్గానికి చెందిన కుల పంచాయతీ నుంచి బెదిరింపులు రావడంతో దంపతులు నాసిక్ వచ్చారు.
ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని, చెల్లించలేని పక్షంలో భార్యను లైంగిక క్రీడకు పంపించాలని పంచాయతీ దీపక్ను ఆదేశించింది. దాంతో దంపతులు సోనీ తండ్రి ఇంటికి వచ్చి ఆశ్రయం తీసుకున్నారు.