మహిళలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ.... తోటి సభ్యుడిపై చెప్పు తీసిన మహిళ సర్పంచ్ ..వీడియో
చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉన్నా...వారి పెత్తనమంతా భర్తలదే కొనసాగుతుంది..పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధులు కాని బయట వ్యవహారమంతా కూడ వాళ్ల భర్తలే చూసుకుంటారు.. దీంతో మహిళలకు తమకు కావాల్సిన అభివృద్దిపనులతో పాటు దేనిపై అధికారం చెలాయించే అవకాశం ఉండదు...దీనికి తోడు ఆయా సమావేశాల్లో కూడ మహిళలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఉంటుంది...
అయితే రాజస్థాన్లో మాత్రం ఓ మహిళా సర్పంచ్ ఇందుకు భిన్నంగా వ్యవహరించింది..తమ హక్కుల కోసం పంచాయితీ సభ్యులను నిలదీసింది.... తమకు పంచాయితీల్లో సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నాడని తోటి పురుష సర్పంచ్ను పంచాయితీ సభలోనే నిలదీసింది..ఈ నేపథ్యంలోనే రాజస్థాన్లోని జుంజుహున్ అనే గ్రామ పంచాయితీలో సమావేశం కొనసాగింది...
దీంతో పంచాయితీ సమావేశం జరుగుతుండాగానే హన్స వర్మా అనే పంచాయితీ సభ్యురాలు మరో సభ్యుడైన రాకేశ్ కాశ్వాన్ పై విరుచుకుపడింది.. సమావేశమందిరంలోనే ఉన్న రాకేశ్ కాశ్వాన్ ఈనేపథ్యంలోనే వద్దకు ఆవేశంగా వెళ్లింది...తమకు పంచాయితీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో మహిళలను కించపరుస్తున్నావంటూ వాగ్వావాదానికి దిగింది... తోటి సభ్యున్ని చెయిపట్టి లాగింది.... అంతటితో ఆగకుండా చెప్పుతీసి కొట్టబోయింది...దీంతో తోటి సభ్యులు వచ్చి ఆమే ప్రయత్నం చేశారు.ఇక తోటి సభ్యున్ని సమావేశంలోనే చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
#WATCH Rajasthan: Panchayat Samiti member Hansa Verma hits another member Rakesh Kaswan during Panchayat meeting in Jhunjhunu. She alleges that Rakesh Kaswan doesn't respect women & doesn't allow her to speak in the Panchayat meetings. (26.06.19) pic.twitter.com/AOIJ0npU5h
— ANI (@ANI) June 27, 2019