ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వం, బాలకృష్ణారెడ్డి పదవి !
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ పదవులు పన్నీర్ సెల్వం చేతికి వచ్చాయి. పన్నీర్ సెల్వం వెంట వచ్చి తమిళనాడు విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన పాండియరాజన్ కు మంత్రి పదవి వచ్చింది. అయితే ఈ సారి ఆయ
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ పదవులు పన్నీర్ సెల్వం చేతికి వచ్చాయి. పన్నీర్ సెల్వం వెంట వచ్చి తమిళనాడు విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన పాండియరాజన్ కు మంత్రి పదవి వచ్చింది. అయితే ఈ సారి ఆయనకు శాఖలు మార్చారు.
తమిళ బాష, సంసృతి పరిరక్షణ శాఖలు పాండియరాజన్ కు అప్పగించారు. తమిళనాడు పశసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న బాలకృష్ణారెడ్డికి శాఖలో మార్పు,లు చేశారు. తమిళనాడు పశు సంవర్ధక శాఖలను ఉదుమలై కే. రాదక్రిష్ణన్ కు అప్పగించారు.
మంత్రి బాలకృష్ణారెడ్డికి యువజన, క్రీడల శాఖను అప్పగించారు. గనులు, భూగర్బజలాల శాఖ నుంచి సంపత్ ను తప్పించి సీవీ. షణ్ముగంకు అప్పగించారు. పన్నీర్ సెల్వంతో పాటు శాఖల్లో మార్పులు చేర్పులు అయిన మంత్రులతో సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో రాజ్ భవన్ గవర్నర్ విద్యాసాగర్ రావు వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పలువురు మంత్రులు, ఇరువర్గాల నాయకులు పాల్గొన్నారు.