బీజేపీ నేత పరేశ్ రావల్కు కీలక పదవి - నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్గా నియమించిన కేంద్రం
ప్రముఖ నడుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు పరేశ్ రావల్ కు కేంద్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ)'కు ఆయనను చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది.
1959లో సంతీత నాటక్ అకాడమీ స్థాపించిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా దేశంలో థియేటర్ శిక్షణాలో కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటూనే స్వతంత్ర వ్యవస్థగా పనిచేసే ఎన్ఎస్డీకి గత మూడేళ్లుగా ఫుల్ టైమ్ చైర్మన్ నియామకం జరగలేదు. రాజస్థానీ కవి, దర్శకుడు అర్జున్ దేవ్ చరణ్ ప్రస్తుతం యాక్టింగా చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఎన్ఎస్డీ నూతన చైర్మన్ గా నియమితుడైన పరేశ్ రావల్ ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగే వీలుంటుంది. నియామక ప్రకటనతోపాటే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరేశ్ కు శుభాభినందనలు సైతం తెలిపింది. ''నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మన్గా నియమితులైనన ప్రఖ్యాత భారతీయ సినీ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత పరేశ్ రావల్ కు హృదయపూర్వక అభినందనలు. మీ సమర్థవంతమైన నాయకత్వంలో ఎన్ఎస్డీ కచ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుతుంది'' అని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
Recommended Video
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications