వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభలో అదే తీరు, వాయిదా: వైసీపీకి కౌంటర్‌గా టీడీపీ సరికొత్త వ్యూహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటులో మరో రోజు అదే తీరు. విపక్షాల ఆందోళనతో లోకసభ శుక్రవారానికి వాయిదా పడింది. ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు, ఇతర విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో సభ వాయిదా పడింది.

Recommended Video

బీజేపీది.. మేం ఏం చేసినా చెల్లుతుందనే కండకావరం : మోడీ పై బాబు

అనంతరం గంట తర్వాత అంటే పన్నెండు గంటలకు సభ ప్రారంభమైంది. అయినా సభ సజావుగా సాగలేదు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారుత. అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్డు ఏర్పాటు కోసం సభలో నిరసన తెలిపారు.

Parliament adjourned for the day

ఏకమైన పార్టీలు

పార్లమెంటులో ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యాయి. ఒక్కో అంశంపై ఒక్కో పార్టీ గురువారం పార్లమెంటు ఎదుట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, టీడీపీ సహా అన్నా పార్టీలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల్లో వైసీపీ, అన్నాడీఎంకేలు లేవు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చారు.

సభలో టీడీపీ కొత్త వ్యూహం

పార్లమెంటులో టీడీపీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లనుంది. పార్లమెంటు నిరవధిక వాయిదా పడితే ఎంపీలంతా రాజీనామా చేసి, ఆమరణ దీక్ష చేయాలని వైసీపీ నిర్ణయించింది. దీనిపై టీడీపీ కొత్త ఎత్తు వేస్తోంది. శుక్రవారం సభ నిరవధిక వాయిదా పడితే రాత్రి వరకు సభ్యులు సభలోనే ఉండాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అలాగే వైసీపీ ఆమరణ దీక్షలకు టీడీపీ పోటీ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.

English summary
Lok Sabha adjourned till Friday following uproar by AIADMK MPs over Cauvery issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X