AN-32 ఐఏఎఫ్ ట్రాన్స్పోర్ట్ విమాన శకలాలు...అరుణాచల్ ప్రదేశ్లో...
ఎట్టకేలకు జూన్ 3న మిస్సైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం an-32 మిలిటరీ ట్రాన్స్ పోర్టో విమాన శకలాలను కనుగొన్నట్టు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు తెలిపారు. విమాన శకలాలను అరుణా ప్రదేశ్లోని లిపో అనే ప్రాంతానికి దగ్గర్లో విమాన శకలాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే అవి మిస్సైన an-32కు సంబంధించిన విమాన విభాగాలని అధికారులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జూన్ 3న ఆస్సాంలో టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన an-32 మిలిటరీ ట్రాన్స్ పోర్టో విమానం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మిస్ అయింది.. మధ్యహ్నాం ఒంటిగంట నుండి విమానానికి సంబంధించిన సమాచారం తెలియడంలేదు. కాగా అస్సాం ఎయిర్ బేస్ నుండి నుండి 12.25 నిమిషాలకు విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన ముప్పై నిమిషాల తర్వాత దానికి సంబంధించిన రాడార్ సమాచారం తెగిపోయింది. కాగా విమానంలో 8మంది విమాన సిబ్బంది కాగా మరో 5గురు భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు.
ఇక విమానం మిస్ అయిన విమానాన్ని కనుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అత్యధునికమైన సుఖోయ్ యుద్ద విమానాలతో కూడ అరుణచల్ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. మిస్ అయిన వారం రోజుల తర్వాత విమాన శకలాలు బయట పడడం గమనార్హం.ఇక గత పది సంవత్సరాల క్రితం కూడ ఇదే ప్రాంతంలో ఏన్ 32 విమానం కూలిన విషయం తెలిసిందే...