సాధ్విని ఒంటరి చేసిన బీజేపీ.. గాడ్సే కామెంట్స్ తో పార్టీకి సంబంధం లేదు!
నాథూరాం గాడ్సే పై బీజేపీ నేతలు, పార్టీ ఎంపీ అభ్యర్థులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపుతుండడంతో బీజేపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే గాడ్సే దేశభక్తడంటూ ఆపార్టీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఝ్జా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు పలు విమర్శలు వస్తున్నాయి. దీంతో పార్టీ చీఫ్ అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు. ప్రజ్ఝాసింగ్ తోపాటు ఇతర బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని చెప్పారు . వాళ్లు చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఎలాంటీ సంబంధం లేదని తేల్చిచెప్పారు. మరోవైపు ఈ వ్యాఖ్యలు చేసిన నేతలు సంజాయిసి చెప్పాలని అమిత్ షా దీంతో వారు ఆవ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీంతో నేతలు దిగివచ్చి క్షమాపణ చేప్పారు.ఇదే విషయాన్ని అమీత్ షా ట్విట్టర్లో పేర్కోన్నారు.
Amit Shah:Statements of Ananthkumar Hegde,Pragya Thakur&Nalin Kateel are their personal opinion,BJP has nothing to do with it.They have withdrawn their statements&apologized. BJP has taken their statements seriously and sent these statements to disciplinary committee (file pic) pic.twitter.com/8ZJYAIeKBl
— ANI (@ANI) May 17, 2019
కాగా మహాత్మగాంధిని చంపిన గాడ్సే తోలిహిందు తీవ్రవాదీ అంటూ నటుడు కమలహాసన్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే బోపాల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గాడ్సేను దేశభక్తుడంటూ కీర్తించింది. దీంతో ఆమే వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రాజకీయ పార్టీలు నుండి ఆమే విమర్శలు ఎదుర్కోంది. మరోవైపు అనంతకుమార్ హెగ్గే తోపాటు నళిన్ కుమార్ లు కూడ వాటిని సమర్ధించారు.
అయితే అవి రాజకీయ దుమారం రేగడంతో పలు విమర్శలు వచ్చాయి. బీజేపీ సైతం ఆమే వ్యాఖ్యలతో ఏకిభవించకపోవడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరింది. దీంతో సాధ్వీ వెనక్కి తగ్గారు. ఆమే వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే తన వ్యాఖ్యలు ఎవరికైన ఇబ్బంది కల్గించి ఉంటే క్షమించాలని కోరారు. మరోవైపు మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పారు.