వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమాన పైలట్ గైర్హాజరు: 7గంటలపాటు 250మంది ప్రయాణికులకు చుక్కలే!

|
Google Oneindia TeluguNews

ముంబై: నగరంలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 250మంది ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. పైలెట్‌ గైర్హాజరు కావడంతో వారంతా విమానశ్రయంలోనే సుమారు 7 గంటలపాటు నిరీక్షించాల్సి రావడమే ఇందుకు కారణం.

ముంబై నుంచి అహ్మదాబాద్‌ వెళ్లాల్సిన ఏయిర్‌ఇండియా విమానం శనివారం ఉదయం 1.35 బయలుదేరాల్సి ఉండగా చివరి నిమిషంలో గంట ఆలస్యం అవుతుందని ప్రకటించారు. అనంతరం మరో 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాలేదు.

 Passengers create ruckus at Mumbai airport over flight delay

తిండి, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు విమాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు కూడా దిగారు. కాగా, చివ‌ర‌కు సుమారు ఉదయం 8 గంటల ప్రాంతంలో పైలట్ రావడంతో విమానం బయలు దేరింది.

ఈ విషయంపై ఏయిర్‌ ఇండియా అధికారులను వివరణ కోరగా.. స్పెషల్‌ ట్రైన్‌డ్‌ పైలెట్‌ గైర్హాజరుతో ఈ సమస్య ఎదురైందని, వేరే పైలెట్‌ను సద్దుబాటు చేసి 8.20 విమానం టేకాఫ్‌ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

English summary
An Air India flight to Ahmedabad was delayed by nearly seven hours due to non-availability of pilot, after which agitated passengers created ruckus at the Chhatrapati Shivaji International Airport here today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X