11 రోజుల్లోనే పాస్పోర్టు... పార్లమెంట్లో కేంద్రమంత్రి
పాస్పోర్టు తీసుకునేందుకు దేశ పౌరులు నానా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే, పాస్ పోర్టు పోందడం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రహసనంగా మారుతోంది. విచారణల పేరుతో ఆలస్యం కావడంతో ఓక్కోసారి పాసుపోర్టు కూడ రద్దు అయ్యో పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం పలు పకడ్భంది చర్యలు తీసుకుంటున్నా.. దళారుల వ్యవస్థ మాత్రం కొనసాగుతూనే ఉంది.దీంతో పాస్పోర్టు కష్టాలపై లోక్సభలో కాంగ్రెస్ సభ్యులు చర్చను లేవదీశారు. దీంతో విదేశీ వ్యవహారాల మంత్రి సమాధానం చెప్పారు.
సాధరణ రోజుల్లో పాస్పోర్టును కేవలం 11 రోజుల్లోనే అందిస్తున్నామని కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ సహయ మంత్రి మురళిధరన్ పార్లమెంట్లో వెళ్లడించారు. పాస్పోర్టు పోందేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తీవారీ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈనేపథ్యంలోనే పాస్పోర్ట్ విచారణ కోసం జిల్లా పోలీసులు యాప్ను వినియోగిస్తున్నారని ,దీని అవినీతీ రహితంగా విచారణ జరగడంతో పాటు త్వరగా పాస్పోర్టును పోందేందుకు అవకాశం కల్గుతుందని అన్నారు.
ఈ నేపథ్యంలోనే దేశంలో 36 పాసుపోర్టు కేంద్రాలు ఉన్నాయని, 93 పాసుపోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 412 పోస్టాఫీసు పాస్పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని, వీటిని నడిపేందుకు ఓ ప్రైవేట్ సంస్థ సహకారం తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.