షాక్: పఠాన్ కోట్ సమీపంలో ఉగ్ర కలకలం, భద్రత దళాల గాలింపు
పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ వైమానిక సమీపంలో మళ్ళీ అనుమానాస్పద వ్యక్తి సంచరిస్తున్నారనే అనుమానంతో నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అణువణువునా గాలిస్తున్నాయి భద్రత దళాలు
చండీఘడ్:పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ వైమానిక సమీపంలో మళ్ళీ అనుమానాస్పద వ్యక్తి సంచరిస్తున్నారనే అనుమానంతో నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అణువణువునా గాలిస్తున్నాయి భద్రత దళాలు.
అనుమానాస్పద వ్యక్తి కదలికలు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి,అయితే దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టారు. పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్ పోలీసులు, సైన్యం , వైమానిక సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలను చేపట్టారు.
పఠాన్ కోట్ పరిసర ప్రాంతాల్లోని ఐదు కిలోమీటర్ల పరిధిలో భద్రతా బలగాలు గాలింపు చర్యలను చేపట్టారు.హెలిక్యాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కూడ ప్రారంభించాయి భద్రతా బలగాలు.
హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కూడ అలర్ట్ అయ్యారు.చక్కి నది సమీపంలో కూడ గాలింపు చేపట్టారు.గతంలో టెర్రరిస్టులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి ప్రయత్నిస్తే భద్రతా దళాలు ముష్కరులను మట్టుబెట్టారు.అయితే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.