బంధువులు కాదు రాబంధువులు: వెంటిలేటర్ ప్లగ్ తీసి, కూలర్ ప్లగ్ పెట్టి ఆన్, మృతి..
నిర్లక్ష్యమో.. లెక్కలేనితనమో తెలియదు కానీ.. అప్పుడప్పుడు కుటుంబసభ్యులు చేసే తప్పులు రోగులపాలిట శాపాలవుతాయి. రాజస్థాన్లోని కోటాలో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. మహారావు భీమ్ సింగ్ ఆస్పత్రిలో 40 ఏళ్ల రోగి చేరారు. అయితే అతనితోపాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. అయితే వేసవి అని ఉక్కపోస్తుందో ఏమో తెలియదు గానీ.. అతని వెంటిలేటర్ ప్లగ్ తీసి.. కూలర్ ప్లగ్ పెట్టారు.
ఈ నెల 15వ తేదీన రోగిన ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అక్కడే అతని బంధువులు కూడా ఉన్నారు. అయితే వారు ఇటీవల ఓ కూలర్ కూడా కొనుగోలు చేశారు. గదిలో వేడి ఉండటంతో.. ఓపెన్ చేయాలని భావించారు. కానీ అక్కడ ప్లగ్ కనిపించలేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచించారు. వెంటిలేటర్ పెట్టిన ప్లగ్ పెట్టి కూలర్ ఆన్ చేశారు. ఇంకేముంది కూలర్ నడుస్తోంది.. వెంటిలేటర్ ఆగిపోవడంతో రోగి చనిపోయాడు.
Recommended Video
ఘటనపై డిప్యూటీ సూపిరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్తో కమిటీ వేశారు. సిబ్బంది, బంధువుల నుంచి కమిటీ సమాచారం సేకరించింది, శనివారం రోజు నివేదిక సమర్పించే అవకాశం ఉంది.