దేశభక్తి అంటే సీఎంను కొట్టించడమేనా : మోదీకి కేజ్రీ ప్రశ్న
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఆయన దేశభక్తి మోసమని మండిపడ్డారు. దేశభక్తి ఉన్న ప్రధాని దేశ రాజధాని పరిధికి చెందిన సీఎంపై దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు.
బీజేపీ నేతల హస్తం
ఇటీవల ఢిల్లీలో రోడ్ షో చేస్తుండగా కేజ్రీవాల్ పై దుండగుడు దాడిచేశాడు. అయితే బీజేపీ నేతలే తనపై దాడి చేయించారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. తనపై దాడి చేయిస్తే .. బీజేపీకి ఒనగూరే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఓ సీఎంపై భౌతిక దాడి సరికాదని విమర్శించారు.
మోసంతో వంచన ..
మోదీ చెప్పేదే దేశభక్తి .. లోన అంతా మోసం, మాయాజాలంతో మోసం చేస్తాడు అని మండిపడ్డారు. మీరంతా మాయాజాలం నుంచి బయటకు వస్తే అసలు నిజం తెలుస్తోంది అని స్పష్టంచేశారు కేజ్రీవాల్.
వ్యాపారులపై ప్రతాపం
దేశ రాజధానిలో పన్నుల వల్ల వ్యాపారాలు చేసేందుకు ఔత్సాహికులు ముందుకురావడం లేదన్నారు. ఢిల్లీలోని 7 నియోజకవర్గాల ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ ను నమ్మడం లేదన్నారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీలో జరుగుతున్న సీలింగ్ నిలిపివేస్తామని కేజ్రీవాల్ హామీనిచ్చారు.