టీ తాగాలనుందా అయితే ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించండి
డిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు తో ప్రజలతో పాటు వ్యాపారస్తులు కూడ తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. పెద్ద నగదు నోట్ల రద్దు కారణగా వ్యాపారులు తమ వ్యాపారాలు జరగక ఇబ్బందిపడుతున్నారు. రోజుకు వందలాది రూపాయాలను నష్టపోతున్నారు. అయితే డిల్లీలోని ఓ టీ స్టాల్ యజమాని వినూత్న ఆలోచనతో తన దుకాాన్ని నడుపుతున్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా పెద్ద దుకాణాలు వినియోగదారులు లేక ఇబ్బందులుపడుతున్నారు. రద్దు చేసిన నగదు నోట్లను తీసుకోవడానికి వ్యాపారులు ఇబ్బందిపడుతున్నారు. అయితే చిల్లర నగదు లేక వినియోగదారులు షాపింగ్ మాల్స్ కు వెళ్ళడం లేదు.నగదు రద్దుతో తన వ్యాపారానికి నష్టం రాకుండా డిల్లీలోని టీ స్టాల్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. ఈ ఆలోచనే ఆయన టీ స్టాల్ ను ప్రస్తుతం నడిపిస్తోంది.
ఆలోచన ఆయనను నిలబెట్టింది
పెద్ద దుకాణాల యజమానులే పెద్ద నగదు నోట్ల రద్దుతో దుకాణాలు మూసేసే పరిస్థితి వస్తే చిన్న టీ స్టాల్ యజమాని మాత్రం నిశ్చింతంగా దుకాణాన్ని నడుపుతున్నాడు. టీ తాగాలనిపిస్తే వెంటనే తన టీ స్టాల్ వద్దకు వచ్చి మరీ టీ తాగాలని కోరుతున్నాడు. డబ్బులు లేవని ఇబ్బందిపడవద్దంటున్నాడు. పెద్ద నగదు నోట్లే ఉన్నా ఫరవాలేదంటున్నాడు ఆ టీ స్టాల్ యజమాని.
టీ తాగాలనిపిస్తే ఆన్ లైన్ లో డబ్బులు పే చేసి తన వద్ద టీ తాగాలని కోరుతున్నాడు డిల్లీకి చెందిన టీ స్టాల్ ఓనర్ బల్వీందర్ సింగ్ పేటిఎం ద్వారా ఆన్ లైన్ డబ్బులు పే చేసే అవకాశం ఉన్న కారణంగా తన వద్ద నిరభ్యంతరంగా టీ తాగాలని ఆయన కోరుతున్నాడు. టీ తాగినవారు పేటీఎం ద్వారా డబ్బులు పే చేస్తున్నారు..దీని ద్వారా తనకు ఇబ్బందులు తప్పుతున్నాయని చెప్పారాయప.