వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థుల ముసుగులో జిహాదీలు, మావోయిస్టులు: అల్లర్ల వెనుక అరాచక శక్తులు: నిర్మలా సీతారామన్..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ రాజధానిలో కొద్దిరోజులుగా చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితుల వెనుక జిహాదీలు, మావోయిస్టులు, వేర్పాటువాదుల హస్తం ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు, అరాచకవాదులు హింసను ప్రేరేపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు, కార్యక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కేసీఆర్..ఉద్ధవ్ థాకరే.. టార్గెట్ నిర్మలా సీతారామన్: నిధులు తొక్కిపెట్టారంటూ..!కేసీఆర్..ఉద్ధవ్ థాకరే.. టార్గెట్ నిర్మలా సీతారామన్: నిధులు తొక్కిపెట్టారంటూ..!

విధ్వంసం వెనుక..

విధ్వంసం వెనుక..

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ రాజధానిలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కొద్దిరోజులుగా ఆందోళన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ ప్రదర్శనలు కాస్తా అదుపు తప్పాయి. హింసాత్మకంగా మారిపోయాయి. బస్సులను దగ్ధం చేసే స్థాయికి చేరుకుంది. పలువురు ఆందోళనకారులు బస్సులను తగుల బెట్టారు. వాటి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ చర్యలకు తాము కారణం కాదని జామియా మిల్లియా విద్యార్థులు సైతం ప్రకటించుకున్నారు.

 స్పందించిన నిర్మలా సీతారామన్..

స్పందించిన నిర్మలా సీతారామన్..

అదే సమయంలో ఢిల్లీ పోలీసులు కొందరు జామియా యూనివర్శిటీ క్యాంపస్ ఆవరణలోకి ప్రవేశించి- విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారు. వారిని అక్రమంగా నిర్బంధించారు. పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ లాఠీ ఛార్జీలో 200 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనల తరువాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ వరుస ఘటనపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నోరు విప్పారు. విద్యార్థుల లాఠీ ఛార్జీపై ఓ కేంద్రమంత్రి స్పందించడం ఇదే తొలిసారి.

ఆందోళన గురించి.. ఏమీ తెలియదు..

ఆందోళన గురించి.. ఏమీ తెలియదు..

జామియా విద్యార్థుల నిర్బంధం గురించి తనకేమీ తెలియదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆదివారం రాత్రి ఏం జరిగిందనేది తన దృష్టికి రాలేదని అన్నారు. సోమవారం ఆమె ఢిల్లీలో తనను కలిసిన విలేెకరులతో మాట్లాడారు. విద్యార్థుల ముసుగులో వేర్పాటువాదులు ప్రవేశించారని ఆరోపించారు. జిహాదీలు, మావోయిస్టులు.. ఈ సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.

త్వరలోనే అన్నీ సర్దుకుంటాయ్..

త్వరలోనే అన్నీ సర్దుకుంటాయ్..


విద్యార్థులెవరూ ఇంత భారీ ఎత్తున హింసాత్మక చర్యలకు దిగకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కొంతమంది అరాచక వాదులు విద్యార్థుల పేరుతో హింసాత్మక చర్యలకు దిగుతున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తరువాతే దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఏర్పడినట్టు కనిపిస్తోందని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని నిర్మలా సీతారామన్ అన్నారు.

English summary
Finance Minister Nirmala Sitharaman on Monday said that citizens should be wary of “jihadists, Maoists and separatists” getting into student activism. Sitharaman, however, said that she was not aware of the events at New Delhi’s Jamia Milia Islamia University over the weekend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X