వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రెచ్చగొట్టింది తమిళులే.. కన్నడిగులపై ఎటాక్ చేశారు' : సదానంద గౌడ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి జల వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెంగుళూరులో చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలు ఒక్కసారిగా అన్ని రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేశాయి. తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ.. తమిళుల రెచ్చగొట్టుడు ధోరణి వల్లే వివాదం ఇంతగా ముదిరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన సదానంద గౌడ.. కన్నడిగులపై, వారి ఆస్తులపై తమిళులు దాడులు చేయడం మూలంగానే వివాదం రాజుకుందన్నారు. అయితే ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ సమన్వయం పాటించాలని సూచించారాయన. హింసతో సమస్యలు పరిష్కారం కావని సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

 Sadananda Gowda

కర్ణాటక రాష్ట్రానికి నీళ్లు లేవన్న విషయాన్ని గుర్తించాలని ఈ సందర్బంగా సదానందగౌడ చెప్పారు. కర్ణాటకలో వర్ణాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే.. కావేరి నీళ్లను కర్ణాటక తమిళనాడుకు విడుదల చేయలేదన్నారు. ఈ ఏడాది 40శాతం తక్కవ వర్షాపాతం నమోదవడంతో.. కేవలం రెండు మూడు రిజర్వాయర్లలోనే తాగు నీటి లభ్యత ఉన్న పరిస్థితి నెలకొందన్నారు.

మునుపెన్నడూ ఇలాంటి తరహా పరిస్థితులు లేవన్న సదానంద గౌడ.. ట్రిబ్యునల్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు.

English summary
central law minister sadananda gowda responded over cauvery dispute. he said Dont blame people of K'taka, we are ones who dont have water. People of TN are provoking Kannadigas
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X