ఆర్టికల్స్ రద్దుతో జమ్ము కశ్మీర్ అభివృద్ది పథంలో కొనసాగుతుంది.. రామ్నాథ్ కోవింద్.
ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లధాఖ్ విభజన..తర్వాత రెండు ప్రాంతాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు ప్రాంతాల ప్రజలకు ఇతర ప్రాంతాల ప్రజలతో పాటు సమాన హక్కులు ప్రభుత్వ ఫలాలు అందనున్నాయని స్పష్టం చేశారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రామ్నాథ్ కోవింద్ బుధవారం సాయంత్రం ప్రసంగించారు.
ప్రజలకు తోడ్పాడు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పింస్తుందని పేర్కోన్న రాష్ట్రపతి పేర్కోన్నారు. దీంతోపాటు మరి కోద్ది రోజుల్లో గాంధీ మహాత్ముని 150 జయంతి వేడుకలకు జరుపుకోభుతున్నామని,ఇది ఒక ప్రత్యేక సంధర్భమని అన్నారు. ఆ సమయంలో స్వాతంత్ర్య సమరయోధుల ఆకాంక్షలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ప్రజలు పెద్ద ఎత్తున అభివృద్దిని కోరుకుంటున్నారని చెప్పిన కోవింద్,దేశ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు.
ఇక దేశ అభివృద్ది కోసం 130 కోట్ల దేశ ప్రజలు తమ నైపుణ్యాలను వెలికి తీయాలని పిలుపునిచ్చారు.అందరి లక్ష్యం దేశన్ని అభివృద్ది పథంవైపు నడిపించడమేనని అన్నారు.ఇక దేశ అభివృద్దిలో యువత ప్రాధాన్యం పెరుగుతుందని, బతుకు బతకనివ్యూ అనే నినాదం అని అన్నారు.కాగా ఇటివల తీసుకువచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల ముస్లిం మహిళలకు న్యాయం చేకూరుతుందని అన్నారు.