ఆ నిర్ణయంతో షాకయ్యా! కరుణ అంత్యక్రియలపై వెంటనే మోడీకి ఫోన్ చేశా: మమత బెనర్జీ
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్లో జరిపేందుకు మొదట రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించని విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి తాను వ్యక్తిగతంగా షాకయ్యానని, వెంటనే ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.
కళైంజ్ఞర్ ఇకలేరు: 'గుర్తుండిపోతారు' అంటూ కరుణానిధిని కీర్తించిన విదేశీ మీడియా
'మెరీనా బీచ్లో కరుణానిధి అంతిమ సంస్కారాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిసి, నేను నిన్న చాలా బాధపడ్డాను. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో మాట్లాడటానికి ఫోన్ చేశాను. కానీ, ఆయన అందుబాటులో లేరని ఆయన సిబ్బంది చెప్పారు. దీంతో నేను ఈ విషయంపై మాట్లాడడానికి ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశాను' అని మమతా బెనర్జీ మీడియాకు తెలిపారు.
కరుణానిధి నల్ల కళ్లద్దాల వెనుక అసలు కథేమిటో తెలుసా?, పసుపు శాలువా అందుకే!
మంగళవారం సాయంత్రం 6.10గంటలకు కరుణానిధి మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే మమతా బెనర్జీ మంగళవారం రాత్రే చెన్నైకి చేరుకున్నారు. కరుణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా, బుధవారం కరుణానిధి అంత్యక్రియలకు తృణమూల్ కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ హాజరుకానున్నారు.
కాగా, కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్లో జరిపేందుకు మొదట ప్రభుత్వం అంగీకరించకపోయినప్పటికీ మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్లో జరుగుతున్నాయి.