చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా బ్యాంకుపై పెట్రోల్ బాంబు దాడి: తప్పిన ప్రమాదం

|
Google Oneindia TeluguNews

చెన్నై: నగరంలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్‌పై ఆగంతకులు శుక్రవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

మే 1న సెలవు దినవం కావడంతో బ్యాంకు సిబ్బంది ఎవరూ బ్యాంకుకు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బైక్ వచ్చిన దుండగలు ఆంధ్రాబ్యాంక్‌పైకి బాంబు విసిరి అనంతరం అక్కడి నుంచి పరారైయ్యారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Petrol bomb hurled at Andhra Bank, no casualties

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఎన్ కౌంటర్‌కు నిరసనగా ఏప్రిల్ 10వ తేదీన తమిళనాడులోని మూడు ఆంధ్రా బ్యాంకులపై ఆందోళనకారులు దాడి చేసిన సంగతిని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. రాజకీయ పార్టీల నేతృత్వంలో ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఏపి బస్సులను కూడా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

English summary
Unidentified motorcycle-borne men on Friday hurled a petrol bomb at an Andhra Bank branch here, police said. No one was injured in the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X