బిజెపి నేత నందకుమార్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని బిజెపి నేత సీఆర్ నందకుమార్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఇంటి ముందు ఆపి ఉన్న ఆయన కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.
తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి విగ్రహంపై దాడికి పాల్పడ్డారు. విగ్రహల దాడిపై తమిళనాడుకు చెందిన బిజెపి నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కోయంబత్తూరులోని బిజెపి కార్యాలయంపై పెట్రోల్ దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కోయంబత్తూరు బిజెపి జిల్లా అధ్యక్షుడు సీఆర్ నందకుమార్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది
ఈ దాడిలో ఆయనకు ఏం కాలేదు. కానీ, ఇంటి ముందు నిలిపి ఉన్న ఆయన కారు ధ్వంసమైంది. బుధవారం నాడు ఉదయం మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.సంఘటనస్థలాన్ని బిజెపి రాష్ట్ర నేతలు పరిశీలించే అవకాశం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఈ తరహ ఘటనలు ఎక్కువయ్యాయి